రోడ్డు భద్రతపై సౌదీ అరేబియాలో కొత్త సెంటర్ ప్రారంభం
- September 06, 2021
రియాద్: రోడ్డు భద్రతను మరింత పెంచేలా ఓ కొత్త కేంద్రాన్ని సౌదీ అరేబియా ప్రారంభించింది. సెంటర్ ఆఫ్ ఎపిడిమాలజీ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేలా తీసుకోవాల్సిన తగు చర్యల్ని అధ్యయనం చేస్తోంది. సౌదీ రెడ్ క్రిసెంట్ అధారిటీ ప్రెసిడెంట్ డాక్టర్ జలాల్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైసీ మాట్లాడుతూ, 2025 నాటికి రోడ్డు ప్రమాదాలపై మానిటరింగ్ మరియు గాయాలపై రీసెర్చ్ వంటి విభాగాలలో తమ సంస్థ రీజినల్ లీడర్ అవుతుందని అన్నారు. సెంటర్ డైరెక్టర్ యూసెఫ్ అల్ సఫియాన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటాను విశ్లేషించడానికి నిపుణుల్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల్ని తగ్గించడానికి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడం, అదే విధంగా వారిని చైతన్య వంతుల్ని చేయడం ఈ సెంటర్ లక్ష్యం.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









