రోడ్డు భద్రతపై సౌదీ అరేబియాలో కొత్త సెంటర్ ప్రారంభం
- September 06, 2021
రియాద్: రోడ్డు భద్రతను మరింత పెంచేలా ఓ కొత్త కేంద్రాన్ని సౌదీ అరేబియా ప్రారంభించింది. సెంటర్ ఆఫ్ ఎపిడిమాలజీ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేలా తీసుకోవాల్సిన తగు చర్యల్ని అధ్యయనం చేస్తోంది. సౌదీ రెడ్ క్రిసెంట్ అధారిటీ ప్రెసిడెంట్ డాక్టర్ జలాల్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైసీ మాట్లాడుతూ, 2025 నాటికి రోడ్డు ప్రమాదాలపై మానిటరింగ్ మరియు గాయాలపై రీసెర్చ్ వంటి విభాగాలలో తమ సంస్థ రీజినల్ లీడర్ అవుతుందని అన్నారు. సెంటర్ డైరెక్టర్ యూసెఫ్ అల్ సఫియాన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటాను విశ్లేషించడానికి నిపుణుల్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల్ని తగ్గించడానికి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడం, అదే విధంగా వారిని చైతన్య వంతుల్ని చేయడం ఈ సెంటర్ లక్ష్యం.
తాజా వార్తలు
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- లైసెన్సు లేకుండా బైక్ నడిపిన టీనేజర్ అరెస్టు..!!
- కొత్తగా వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షలు..!!
- మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థలు..!!
- మక్కాలో 18 మంది పాకిస్థానీలు, ఆఫ్ఘన్లు అరెస్టు..!!
- నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్.. ఇద్దరు మహిళలకు 7 లక్షల దిర్హమ్ల జరిమానా..!!
- దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి
- సీఎంగా రెండోసారి హిమంత్ బిశ్వశర్మ









