ఒమన్ సుల్తాన్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన భారత రాష్ట్రపతి

- September 07, 2021 , by Maagulf
ఒమన్ సుల్తాన్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన భారత రాష్ట్రపతి

ఒమన్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హైతం బిన్ తారిక్ పంపిన సందేశానికి  ప్రతిస్పందనగా రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలుపు సందేశాన్ని పంపించారు. స్నేహపూర్వక దేశాలైన ఒమన్, భారత్ మధ్య ఉన్న మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎప్పుడు ముందుంటామని రాష్ట్రపతి వెల్లడించారు. అలాగే సుల్తాన్ మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశ ప్రజలు సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నట్లు రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com