ఆఫ్గానిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు..
- September 07, 2021
కాబూల్: ఆఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీ ప్రధానిగా ముల్లా బరాదర్ వ్యవహరించనున్నారు. గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల అది వాయిదా పడింది.అయితే తాలిబన్లు ప్రభుత్వంలో అంత ఊహించినట్టుగానే.. మహిళలకు మాత్రం చోటు కల్పించలేదు.
ఇక, అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన తర్వాత.. తాలిబన్లు చాలా వేగంగా పావులు కదిపారు. ఆఫ్ఘాన్లోని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ వేగంగా ముందుకు కదిలారు. ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్లో తమ చేతుల్లోకి తీసుకన్న సంగతి తెలిసిందే. ఇక, ఆగస్టు 30వ తేదీన అమెరికాల పూర్తిగా ఆఫ్ఘానిస్తాన్ నుంచి వెళ్లిపోయాయి.అయితే ఆఫ్ఘానిస్తాన్లో వారం క్రితమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు చెప్పినప్పటికీ.. అది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తాలిబన్లు.. అక్కడ ముల్ల మహమ్మద్ హసన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







