ఆఫ్గానిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు..
- September 07, 2021
కాబూల్: ఆఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీ ప్రధానిగా ముల్లా బరాదర్ వ్యవహరించనున్నారు. గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల అది వాయిదా పడింది.అయితే తాలిబన్లు ప్రభుత్వంలో అంత ఊహించినట్టుగానే.. మహిళలకు మాత్రం చోటు కల్పించలేదు.
ఇక, అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన తర్వాత.. తాలిబన్లు చాలా వేగంగా పావులు కదిపారు. ఆఫ్ఘాన్లోని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ వేగంగా ముందుకు కదిలారు. ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్లో తమ చేతుల్లోకి తీసుకన్న సంగతి తెలిసిందే. ఇక, ఆగస్టు 30వ తేదీన అమెరికాల పూర్తిగా ఆఫ్ఘానిస్తాన్ నుంచి వెళ్లిపోయాయి.అయితే ఆఫ్ఘానిస్తాన్లో వారం క్రితమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు చెప్పినప్పటికీ.. అది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తాలిబన్లు.. అక్కడ ముల్ల మహమ్మద్ హసన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!







