NEET పరీక్షలు ప్రారంభం
- September 12, 2021న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలైంది. అయితే 1.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ముందుగానే వచ్చారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాస్తున్నారు. ఎపిలో 10 పట్టణాల్లోని 151, తెలంగాణాలో 7 పట్టణాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సారి పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డు మామ్రే అనుమతించినున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) తన నియమ, నిబంధనల్లో తెలిపింది. సాయంత్రం ఐదు గంటలకు పరీక్ష ముగుస్తుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..