NEET పరీక్షలు ప్రారంభం
- September 12, 2021
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలైంది. అయితే 1.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ముందుగానే వచ్చారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాస్తున్నారు. ఎపిలో 10 పట్టణాల్లోని 151, తెలంగాణాలో 7 పట్టణాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సారి పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డు మామ్రే అనుమతించినున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) తన నియమ, నిబంధనల్లో తెలిపింది. సాయంత్రం ఐదు గంటలకు పరీక్ష ముగుస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







