సౌదీ:విమాన ప్రయాణికులకు ఎంట్రీ రూల్స్ అప్ డేట్
- September 14, 2021
సౌదీ: దేశంలోకి ప్రవేశించే విమాన ప్రయాణికులకు సంబంధించి ఎంట్రీ రూల్స్ ను అప్ డేట్ చేసింది సౌదీ ప్రభుత్వం. కరోనావైరస్ మహమ్మారిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా..క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ విధానాలను ప్రకటించింది. ఈ మేరకు కింగ్డమ్ వచ్చే ప్రయాణీకులు దేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో ఏదైన ఒక వ్యాక్సిన్ ను ఒక డోసు తీసుకున్నట్లయితే..వారు తప్పకుండా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల లోపల తీసుకున్న రిపోర్ట్ లను మాత్రమే అనుమతిస్తారు. కింగ్డమ్ చేరుకున్నాక.. ప్రయాణీకుడు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు సంస్థాగత నిర్బంధంలో ఉండాలి. అలాగే దేశానికి చేరుకున్న తొలి 24 గంటలలోపు అదేవిధంగా ఐదవ రోజు కూడా PCR టెస్ట్ చేయించుకోవాలి. తవక్కల్నా యాప్ లో వారి రిపోర్టులను అప్డేట్ చేయాలి.
ఇక రెండు కోర్సులు తీసుకున్న ప్రయాణికులతో ఉండే మైనారిటీ వయసు వారు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకుంటే..ఐదు రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. ఐదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా సంస్థాగత నిర్బంధంలో ఉండాలి. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఆమోదించని సినోఫార్మ్, సినోవాక్ టీకాలు తీసుకున్న వ్యక్తులు కింగ్డమ్ వచ్చిన తర్వాత దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో బూస్టర్ డోస్ పొందాలి.
తాజా వార్తలు
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!









