ఆప్ఘాన్‌కు అండగా మేముంటాం: జైశంకర్

- September 14, 2021 , by Maagulf
ఆప్ఘాన్‌కు అండగా మేముంటాం: జైశంకర్

ఢిల్లీ: ఆప్ఘానిస్తాన్‌కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఆప్ఘాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, మానవ సంక్షోభం ఏర్పడిందని, దీంతో ఆ దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆప్ఘానిస్తాన్‌లో నెలకొన్న మానవ సంక్షోభం యూనైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సమావేశంలో నిర్వహించింది. ఈ సమవేశంలో భారత్ తన పాత్ర గురించి వివరించింది.

ఆప్ఘాన్‌ను అమెరికా బలగాలు వీడిన తర్వాత తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశంలో ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. మహిళలపై తాలిబన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక భద్రత వ్యవహారాలతో ఆప్ఘాన్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ఆప్ఘాన్‌లోని ప్రస్తుత పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అక్కడ పేదరికం మరింత పెరిగే అవకాశముందని యూఎన్‌ఓ అంచనాలను మరోసారి గుర్తు చేశారు. అయితే ఎప్పటిలానే ఆప్ఘాన్‌తో భారత్ స్నేహాపూర్వక సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్ఘాన్‌ ప్రజల తరపున నిలబడేందుకు భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com