కోనేరు ప్రసాద్ రాజీనామా తో షాక్ తిన్న 'వైసీపీ'
- March 16, 2016
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో పోటీ చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని, తమ రాజీనామాను ఆమోదించాల్సింగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, దీంతోపాటు ఉత్తరాంధ్రలో కోనేరు ప్రసాద్కు బీచ్ సాండ్ ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దానిపై శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తారు. దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోనేరు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







