స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్
- September 20, 2021ఒమన్: కోవిడ్ పరిస్థితుల తర్వాత ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ..తాజా క్రీడాప్రియులకు కూడా శుభవార్త అందించింది. దేశంలో స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లలో ఏదైన ఒక వ్యాక్సిన్ను కనీసం సింగిల్ డోస్ అయిన తీసుకున్న వారినే అనుమతించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈవెంట్ వేదిక సామర్ధ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని తెలిపింది.
ఇదిలా ఉంటే...ఇరాన్, ఇరాక్ నుంచి ఒమన్ వచ్చే వారికి సంబంధించి క్వారంటైన్ నిబంధనలను కూడా సడలించింది. విదేశీ ప్రయాణికులను సెప్టెంబర్ 1 నుంచే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చినా..ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చే వారు మాత్రం క్వారంటైన్ లో ఉండాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడా నిబంధనలను సడలిస్తూ ఇతర దేశాల ప్రయాణికులకు వర్తించిన నిబంధనలే ఈ రెండు దేశాలకు కూడా వర్తిస్తాయని ఒమన్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు