ఇకపై ఈ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించనక్కర్లేదు!!
- September 22, 2021యూఏఈ: కోవిడ్ మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా, ఈ మాస్క్ ధరించటం అనేది బహు ఇబ్బందిగా ఉండటం మాత్రం కాదనలేని నిజం..తాజాగా, పలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను తొలగించారు యూఏఈ అధికారులు. అయితే, ప్రజలు తప్పనిసరిగా రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించాల్సిందే అని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) బుధవారం, సెప్టెంబర్ 22 న ప్రకటించింది.
ఈ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు:
* బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేసేటప్పుడు.
* ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణిస్తుంటే (అనగా, ఒకే ఇంటి నుండి ప్రజలు ప్రయాణిస్తుంటే)
* బీచ్కి వెళ్లేవారు
* ఈత కొలనుల వద్ద ఉన్నవారు
ఎందుకీ నిర్ణయం?
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 శాతం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం, దేశంలో కేవలం 322 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా ఖ్యాతి పొందింది యూఏఈ. వీరిలో 92 శాతం మంది నివాసితులు కనీసం ఒక డోస్ అందుకోగా..81 శాతానికి పైగా నివాసితులు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తిచేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ