ఇకపై ఈ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించనక్కర్లేదు!!
- September 22, 2021
యూఏఈ: కోవిడ్ మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా, ఈ మాస్క్ ధరించటం అనేది బహు ఇబ్బందిగా ఉండటం మాత్రం కాదనలేని నిజం..తాజాగా, పలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను తొలగించారు యూఏఈ అధికారులు. అయితే, ప్రజలు తప్పనిసరిగా రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించాల్సిందే అని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) బుధవారం, సెప్టెంబర్ 22 న ప్రకటించింది.
ఈ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు:
* బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేసేటప్పుడు.
* ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణిస్తుంటే (అనగా, ఒకే ఇంటి నుండి ప్రజలు ప్రయాణిస్తుంటే)
* బీచ్కి వెళ్లేవారు
* ఈత కొలనుల వద్ద ఉన్నవారు
ఎందుకీ నిర్ణయం?
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 శాతం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం, దేశంలో కేవలం 322 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా ఖ్యాతి పొందింది యూఏఈ. వీరిలో 92 శాతం మంది నివాసితులు కనీసం ఒక డోస్ అందుకోగా..81 శాతానికి పైగా నివాసితులు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తిచేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







