ఇకపై ఈ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించనక్కర్లేదు!!
- September 22, 2021యూఏఈ: కోవిడ్ మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా, ఈ మాస్క్ ధరించటం అనేది బహు ఇబ్బందిగా ఉండటం మాత్రం కాదనలేని నిజం..తాజాగా, పలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను తొలగించారు యూఏఈ అధికారులు. అయితే, ప్రజలు తప్పనిసరిగా రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించాల్సిందే అని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) బుధవారం, సెప్టెంబర్ 22 న ప్రకటించింది.
ఈ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు:
* బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేసేటప్పుడు.
* ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణిస్తుంటే (అనగా, ఒకే ఇంటి నుండి ప్రజలు ప్రయాణిస్తుంటే)
* బీచ్కి వెళ్లేవారు
* ఈత కొలనుల వద్ద ఉన్నవారు
ఎందుకీ నిర్ణయం?
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 శాతం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం, దేశంలో కేవలం 322 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా ఖ్యాతి పొందింది యూఏఈ. వీరిలో 92 శాతం మంది నివాసితులు కనీసం ఒక డోస్ అందుకోగా..81 శాతానికి పైగా నివాసితులు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తిచేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?