ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి

- September 24, 2021 , by Maagulf
ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి

మస్కట్: ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల్ని మసీదుల్లో నిలిపివేయడం జరిగింది. కాగా, సుప్రీం కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, శుక్రవారం ప్రార్థనల్ని సెప్టెంబర్ 24 నుంచి అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని నిబంధనల్ని విధించారు ఈ ప్రార్థనలకు హాజరయ్యేవారికి సంబంధించి. పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేకంగా కార్పెట్లను తెచ్చుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరి. మసీదుల్లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com