కోవిడ్ 19పై బహ్రెయిన్ పోరాటాన్ని అభినందించిన భారత రాయబారి

- September 25, 2021 , by Maagulf
కోవిడ్ 19పై బహ్రెయిన్ పోరాటాన్ని అభినందించిన భారత రాయబారి

మనామా: బహ్రెయిన్‌లో భారత రాయబారి అయిన పియుష్ శ్రీవాస్తవ, బహ్రెయిన్ నాయకత్వం కోవిడ్ నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యల్ని అభినందించారు. రెడ్ లిస్ట్ దేశాల నుంచి భారతదేశాన్ని తొలగించడం పట్ల బహ్రెయిన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీవాస్తవ. చెల్లుబాటయ్యే వీసాలున్న భారతీయులు, బహ్రెయిన్ వెళ్ళడానికి ఇకపై ఎలాంటి ఇబ్బందులూ వుండవని ఆయన అన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బహ్రెయిన్‌లో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని చెప్పారు రాయబారి శ్రీవాస్తవ.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com