2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా ...
- March 17, 2016
2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా పద్ధతిలో ఎంపిక చేసేందుకు కేంద్ర హజ్ కమిటీ ప్రణాళికలు పూర్తి చేసింది. ఒకే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ర్ర్టాలకు డ్రా తీసేందుకు ఏర్పాటు చేశారు. ఉదయం తెలంగాణ, మధ్యాహ్నం ఆంధ్ర ప్రాంతం హజ్ యాత్రికుల ఎంపిక జరుతుందని హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు 20వ తేదీ ఆదివారం కేంద్ర హజ్ కమిటీ అధికారులు డ్రా తీస్తారని చెప్పారు. కానీ ఇంకా అధికారికంగా డ్రా తేదీ ప్రకటించలేదని, ఒకటి, రెండు రోజలు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల నుంచి 17,394 దరఖాస్తులు అందాయని, అందులో నగరం నుంచి 11,487 దరఖాస్తులు అందాయని ప్రత్యేక అధికారి తెలిపారు.ఈ ఏడాది 2011 రాష్ట్ర ముస్లిం జనాభా ఆధారం గా రాష్ర్టానికి హజ్ కోటా కేటాయిస్తారన్నారు. ఉపముఖ్యమం త్రి మహమూద్ అలీ, నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి దత్త్తాత్రేయకు రాష్ట్ర హజ్ కోటా పెంపుకో సం విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









