IPL: SRH టార్గెట్ 165 పరుగులు
- September 27, 2021
దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా 40 వ మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈవిన్ లీవిస్ (6) రూపంలో తొలి వికెట్ను తర్వగా కోల్పోయిన రాజస్థాన్ టీం.. జైస్వాల్, శాంసన్ సమయానుకూలంగా ఆడుతూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు తరలిస్తూ స్కోర్ బోర్డును పెంచేందుకు సహాయపడ్డారు. దూకుడు మీదున్న జైస్వాల్(36 పరుగులు, 23 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్)ను సందీప్ శర్మ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ (4) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మరోసారి మహిపాల్ లామ్రోర్(29)తో కీలకమైన భాగస్వామ్యాన్ని శాంసన్ నెలకొల్పాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కేవలం 57 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు సాధించి, హైదరాబాద్ ముందు భారీ స్కోర్ ఉంచేందుకు సహాయపడ్డాడు. 143 స్ట్రైక్రేట్తో పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో సిద్ధార్ధ్ కౌల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో కౌల్ 2 వికెట్లు, సందీస్ శర్మ, భువనేశ్వర్ శర్మ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









