మస్కట్‌ ఇండియన్‌ స్కూల్‌లో ట్యూషన్‌ ఫీజు పెంపు

- March 17, 2016 , by Maagulf
మస్కట్‌ ఇండియన్‌ స్కూల్‌లో ట్యూషన్‌ ఫీజు పెంపు

ఇండియన్‌ స్కూల్‌ మస్కట్‌ (ఐఎస్‌ఎం) ట్యూషన్‌ ఫీజుని పెంచింది. ఈ పెంపు నెలకి 4 ఒమన్‌ రియాల్స్‌గా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని నోటీసు ద్వారా పేర్కొంది స్కూలు యాజమాన్యం. ప్రస్తుత ఫీ స్ట్రక్చర్‌కి అదనంగా ఏడాదికి 48 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించవలసి ఉంటుంది విద్యార్థుల తల్లిదండ్రులు. ఇండియన్‌ స్కూల్‌ మస్కట్‌లో చదువుతున్న విద్యార్థి తండ్రి మనోజ్‌ బాలకృష్ణన్‌ ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు నిర్ణయం ఆహ్వానించదగ్గది కాదనీ, ఇంక్రిమెంట్లు లేక బోనస్‌లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఫీజుల పెంపు ఇబ్బందికరమని అన్నారు. ఫీజుల పెంపుకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన ప్రచారం మొదలు పెట్టారు. గత ఏడాది ఈ పెంపుదల 1.5 ఒమన్‌ రియాల్స్‌గా ఉంది. ఇండియన్‌ స్కూల్‌ ఒమన్‌లో 9,000 మంది విద్యార్థులు కెజి1 నుంచి క్లాస్‌ 12 వరకు చదువుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com