మస్కట్ ఇండియన్ స్కూల్లో ట్యూషన్ ఫీజు పెంపు
- March 17, 2016
ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్ఎం) ట్యూషన్ ఫీజుని పెంచింది. ఈ పెంపు నెలకి 4 ఒమన్ రియాల్స్గా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని నోటీసు ద్వారా పేర్కొంది స్కూలు యాజమాన్యం. ప్రస్తుత ఫీ స్ట్రక్చర్కి అదనంగా ఏడాదికి 48 ఒమన్ రియాల్స్ చెల్లించవలసి ఉంటుంది విద్యార్థుల తల్లిదండ్రులు. ఇండియన్ స్కూల్ మస్కట్లో చదువుతున్న విద్యార్థి తండ్రి మనోజ్ బాలకృష్ణన్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు నిర్ణయం ఆహ్వానించదగ్గది కాదనీ, ఇంక్రిమెంట్లు లేక బోనస్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఫీజుల పెంపు ఇబ్బందికరమని అన్నారు. ఫీజుల పెంపుకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన ప్రచారం మొదలు పెట్టారు. గత ఏడాది ఈ పెంపుదల 1.5 ఒమన్ రియాల్స్గా ఉంది. ఇండియన్ స్కూల్ ఒమన్లో 9,000 మంది విద్యార్థులు కెజి1 నుంచి క్లాస్ 12 వరకు చదువుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







