భారత్లో కరోనా కేసుల వివరాలు
- October 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్లో గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్లో పేర్కొన్నది. దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది.ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 277 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,339కి చేరింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకు భారత్లో 89,02,08,007 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







