ఢిల్లీలో పోలీస్ స్టేషన్పై దాడి, 53 మంది అరెస్టు
- October 01, 2021
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా నైజీరియా దేశస్థులై ఉంటారని భావిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్పై నైజీరియన్లు కర్రెలు, రాళ్లతో దాడి చేశారు. విదేశీయులు దాడి చేసిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అయితే ఆ సమయంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన విదేశీయులు..
తీవ్ర విధ్వసం సృష్టించారు. ఇటీవల తమ గ్రూపునకు చెందిన ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో.. నైజీరియన్లు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేయాలని పోలీసులు భావించారు. దీన్ని నైజీరియన్లు వ్యతిరేకించారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









