భారత్‌కు వచ్చే బ్రిటన్‌ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్‌

- October 01, 2021 , by Maagulf
భారత్‌కు వచ్చే బ్రిటన్‌ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్‌

న్యూఢిల్లీ : భారత్‌కు వచ్చే బ్రిటన్‌ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే. వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా సోమవారం నుండి ఈ మేరకు ఆంక్షలు అమలులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై బ్రిటన్‌ వివాదాస్పద నిర్నయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కూడా రిటర్న్‌గిఫ్ట్‌గా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 4 నుండి భారత్‌కు వచ్చే బ్రిటన్‌ దేశస్తులు ప్రయాణానికి 72 గంటల ముందు గాని, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గాని మూడు కొవిడ్‌ - 19 ఆర్‌టి- పిసిఆర్‌ పరీక్షలు చేయించుకోవలసి ఉంది. వచ్చిన అనంతరం భారత్‌లో పదిరోజుల పాటు నివాసంలో గాని, చేరుకున్న ప్రాంతంలో కాని క్వారంటైన్‌లో ఉండాలని ఆ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com