రీ-ఎంట్రీ బ్యాన్తో ఇల్లీగల్ వర్కర్లను దేశం నుంచి బహిస్కరించిన ఎల్ఎంఆర్ఎ
- October 04, 2021
బహ్రెయిన్: ఎల్ఎంఆర్ఎ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, తనిఖీల్లో ఉల్లంఘనలకు పాల్పడుతూ దొరికిన కార్మికులకు భవిష్యత్తులో వర్క్ పర్మిట్లు జారీ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దేశం విడిచి వెళ్ళడం తప్ప, వారికి మరో అవకాశం వుండదని డాక్టర్ ఖాలెద్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ చెప్పారు. వారికి దేశంలోకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇవ్వబోమన్నారు. సాసా వీధిలో షాపులపై ప్రధానంగా దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలతో కలిసి తనిఖీల చేపడుతున్నారు. నేషనాలిటీ పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, క్యాపిటల్ పోలీస్ డైరెక్టరేట్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ మరియు టూరిజం అలాగే మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ విభాగాలతో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 17506055 నెంబరుకి ఫోన్ చేసి కూడా ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







