హాట్ కేకుల్లా అమ్ముడైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు
- October 04, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇండియాలోనో, పాకిస్తాన్ లోనో మ్యాచ్ జరిగితే టికెట్లు దొరకటమే కష్టం. కానీ తటస్థ వేదికపై ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 24 న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్లను ఇలా అమ్మటం స్టార్ట్ చేశారో లేదో రెండు రోజుల్లో టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు వెబ్ సైట్ కు పోటెత్తారు. ప్రీమియం, ప్లాటినం టిక్కెట్లు కూడా సేల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు టికెట్లు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి మ్యాచ్ లకు 70 శాతం మంది అభిమానులను మాత్రమే అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









