హాట్ కేకుల్లా అమ్ముడైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు
- October 04, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇండియాలోనో, పాకిస్తాన్ లోనో మ్యాచ్ జరిగితే టికెట్లు దొరకటమే కష్టం. కానీ తటస్థ వేదికపై ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 24 న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్లను ఇలా అమ్మటం స్టార్ట్ చేశారో లేదో రెండు రోజుల్లో టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు వెబ్ సైట్ కు పోటెత్తారు. ప్రీమియం, ప్లాటినం టిక్కెట్లు కూడా సేల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు టికెట్లు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి మ్యాచ్ లకు 70 శాతం మంది అభిమానులను మాత్రమే అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







