హాట్ కేకుల్లా అమ్ముడైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు
- October 04, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇండియాలోనో, పాకిస్తాన్ లోనో మ్యాచ్ జరిగితే టికెట్లు దొరకటమే కష్టం. కానీ తటస్థ వేదికపై ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 24 న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్లను ఇలా అమ్మటం స్టార్ట్ చేశారో లేదో రెండు రోజుల్లో టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు వెబ్ సైట్ కు పోటెత్తారు. ప్రీమియం, ప్లాటినం టిక్కెట్లు కూడా సేల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు టికెట్లు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి మ్యాచ్ లకు 70 శాతం మంది అభిమానులను మాత్రమే అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..







