న్యూ ట్రావెలింగ్ అడ్వయిజరీ. వ్యాక్సినేషన్ అవ్వని పిల్లలకు అనుమతి

- October 04, 2021 , by Maagulf
న్యూ ట్రావెలింగ్ అడ్వయిజరీ. వ్యాక్సినేషన్ అవ్వని పిల్లలకు అనుమతి

ఖతార్: తమ దేశంలోకి విదేశాల నుంచి ట్రావెలర్స్ కోసం ఖతార్ కొత్త ట్రావెల్ అడ్వయిజరీని ప్రకటించింది. 11 ఏళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్ లేకపోయిన సరే ఖతార్ ను సందర్శించవచ్చని తెలిపింది. ఐతే ఖతార్ కు వచ్చే మూడు రోజుల ముందు వారికి యాంటీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని తెలిపింది. కానీ పిల్లల కుటుంబ సభ్యులంతా కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని న్యూ ట్రావెల్ అడ్వయిజరీలో పేర్కొంది. ముఖ్యంగా రెడ్ లిస్ట్ లో ఉన్న ఇండియా, ఫిలిప్పీన్స్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండోనేషియా, కెన్యా, సూడాన్ ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ ట్రావెల్ అడ్వయిజరీని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి కొత్త ట్రావెల్ అడ్వయిజరీ అమల్లోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com