అమర్నాథ్ యాత్ర జూలై రెండో తేదీ నుంచి మొదలు...
- March 17, 2016
ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రకు వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూలై రెండో తేదీ నుంచి మొదలు కాబోతున్న ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు.. ప్రత్యేకంగా ఎంపికచేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, జేఅండ్కే బ్యాంక్, యస్ బ్యాంక్ శాఖల్లో వివరాలు నమోదుచేసుకునే వీలుంది. మొదట దరఖాస్తుచేస్తున్న వారికి మొదట అనుమతించే విధానంలో అనుమతులు జారీ చేయనున్నారు. ఒక అనుమతి ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఈ బ్యాంకు శాఖల్లో నిర్దేశించిన రోజుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు, 75 ఏళ్లు పైబడినవారు, ఆరు కంటే ఎక్కువ వారాలు పూర్తైన గర్భిణులను యాత్రకు అనుమతించరు.ప్రతి యాత్రికుడూ దరఖాస్తుతోపాటు ఆరోగ్య ధ్రువపత్రం(సీహెచ్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు చూడాలని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









