అమర్‌నాథ్‌ యాత్ర జూలై రెండో తేదీ నుంచి మొదలు...

- March 17, 2016 , by Maagulf
అమర్‌నాథ్‌ యాత్ర జూలై రెండో తేదీ నుంచి మొదలు...

ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూలై రెండో తేదీ నుంచి మొదలు కాబోతున్న ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు.. ప్రత్యేకంగా ఎంపికచేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ శాఖల్లో వివరాలు నమోదుచేసుకునే వీలుంది. మొదట దరఖాస్తుచేస్తున్న వారికి మొదట అనుమతించే విధానంలో అనుమతులు జారీ చేయనున్నారు. ఒక అనుమతి ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఈ బ్యాంకు శాఖల్లో నిర్దేశించిన రోజుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు, 75 ఏళ్లు పైబడినవారు, ఆరు కంటే ఎక్కువ వారాలు పూర్తైన గర్భిణులను యాత్రకు అనుమతించరు.ప్రతి యాత్రికుడూ దరఖాస్తుతోపాటు ఆరోగ్య ధ్రువపత్రం(సీహెచ్‌సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు చూడాలని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com