భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- October 07, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.నిన్న‌టి బులిటెన్ ప్ర‌కారం 20 వేల‌కు దిగువున కేసులు న‌మోద‌వ్వ‌గా ఈరోజు బులిటెన్ ప్ర‌కారం కేసులు మ‌ళ్లీ పెరిగాయి.  తాజాగా, దేశంలో 22,431 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది.ఇందులో 3,32,00,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.2,44,198 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 318 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 4,49,856కి చేరింది.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనా నుంచి 24,602 మంది కోలుకోగా, 43,08,525 మందికి వ్యాక్సిన్ లు అందించారు.దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 92,63,68,608 మందికి వ్యాక్సిన్ లు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com