పాకిస్థాన్‌లో భూకంపం..20 మంది మృతి

- October 07, 2021 , by Maagulf
పాకిస్థాన్‌లో భూకంపం..20 మంది మృతి

పాకిస్థాన్‌: భూమిపైనే కాదు లోపల కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మనుషులే. అందుకే ఆ పర్యావరణానికి కోపమొచ్చి మనుషులపైకి సునామీలు, భూకంపంలా రూపంలో దూసుకొస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌లో కూడా అదే జరిగింది. గురువారం తెల్లవారుజామున దక్షిణ పాకిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలను కోల్పోయారు. తెల్లవారుజామున కాబట్టి ప్రజలు ఈ భూకంపాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. మరణించిన వారిలో చాలామంది ఇళ్ల గోడలు కూలి మరణించినవారే. చనిపోయినవారిలో ఒక మహిళ, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.7గా నమోదైంది. భూకంపం ధాటికి 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై బలూచిస్తాన్‌ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా స్పందిస్తూ సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com