ఖైదీల్లో పరివర్తనను కృషి చేస్తున్నాం...విద్యా, ఉపాధి శిక్షణ ఇస్తున్నాం
- October 08, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ జైళ్లలో ఉన్న ఖైదీల్లో పరివర్తన కు కృషి చేస్తున్నామని డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ షేక్ ఖలీఫా బిన్ అల్ ఖలీఫా తెలిపారు. గురువారం పలు జైళ్లను ఆయన సందర్శించారు.అక్కడ ఖైదీలను కలిసి వారికి ఎలాంటి సదుపాయాలున్నాయో తెలుసుకున్నారు. అనంతరం జైళ్ల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఖైదీల్లో పరివర్తనకు, వారి పునరావాస చర్యలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.ఖైదీలకు హాండీక్రాప్ట్ సహా పలు రంగాల్లో ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు అధికారులకు తెలిపారు. చదువుకునే వారికి విద్యా సాయం అందించాలని, వైద్య సదుపాయాల విషయంలో రాజీ పడవద్దని మీటింగ్ లో చెప్పారు. ఖైదీలు పనిచేసే చోటును పరిశీలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నామని చెప్పారు. జైలు అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







