జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సదరన్ టెర్మినల్ ప్రాజెెక్ట్ పనులు ప్రారంభం
- October 09, 2021రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్టులో సదరన్ కంటైనర్ టెర్మినల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ), దుబాయ్ పోర్ట్స్ వరల్డ్ ప్రాజెక్ట్ కలిసి గురువారం పనులు మొదలుపెట్టాయి. మొత్తం నాలుగు ఫేజ్ లలో పనులు చేస్తారు. 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ రూపురేఖలు మారిపోతాయి. ఒకేసారి ఐదు నౌకలను ఇక్కడ నిలపవచ్చు. కంటైనర్ షిప్లలో 26,000 TEU ల లోడ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ కు ఇది కేంద్రంగా మారుతుంది. 30 ఏళ్ల పాటు సౌదీ పోర్ట్స్ అథారిటీ, దుబాయ్ పోర్ట్స్ ఆధ్వర్యంలో సదరన్ టెర్మినల్ నడిచేలా ఒప్పందం చేసుకున్నారు. జెడ్డా పోర్ట్ పనితీరు ఏటేటా మెరుగవుతోంది. లాయిడ్స్ లిస్ట్ గతేడాది ర్యాంకింగ్స్ లో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని ప్రపంచంలోనే 37 వ అతిపెద్ద నౌకాశ్రయంగా నిలిచింది.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ