అల్-సఫ్రియా మసీదు లో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రార్థనలు
- October 09, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా శుక్రవారం అల్ సఫ్రియా ప్యాలెస్ లో ప్రార్ధనలు చేశారు. ఆయనతో పాటు రాజు కుమారుడు, సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మహ్మద్ అల్-హెజేరి మసీదు లో ప్రార్థనలు చేశారు. అనంతరం అల్ -హెజెరీ మాట్లాడారు. రాజు హమిద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో బహ్రెయిన్ ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా ఉన్నారని అన్నారు. బహ్రెయిన్ రాజ్యంపై అల్లా చూపుతున్న దయకు కృతజ్ఞులమని ఆయన అన్నారు. కరోనా మహమ్మరి ప్రభావం పూర్తిగా తగ్గి మసీదులో ఎప్పటిలాగే సాధారణ ప్రార్థనలు జరగాలని ఆకాంక్షించారు. అదే విధంగా రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కు ఎప్పుడూ అల్లా ఆశీర్వదం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







