అల్-సఫ్రియా మసీదు లో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రార్థనలు
- October 09, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా శుక్రవారం అల్ సఫ్రియా ప్యాలెస్ లో ప్రార్ధనలు చేశారు. ఆయనతో పాటు రాజు కుమారుడు, సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మహ్మద్ అల్-హెజేరి మసీదు లో ప్రార్థనలు చేశారు. అనంతరం అల్ -హెజెరీ మాట్లాడారు. రాజు హమిద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో బహ్రెయిన్ ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా ఉన్నారని అన్నారు. బహ్రెయిన్ రాజ్యంపై అల్లా చూపుతున్న దయకు కృతజ్ఞులమని ఆయన అన్నారు. కరోనా మహమ్మరి ప్రభావం పూర్తిగా తగ్గి మసీదులో ఎప్పటిలాగే సాధారణ ప్రార్థనలు జరగాలని ఆకాంక్షించారు. అదే విధంగా రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కు ఎప్పుడూ అల్లా ఆశీర్వదం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..