నీట మునిగి ఇద్దరు వలసదారుల మృతి, మరొకరి ఆచూకీ గల్లంతు

- October 09, 2021 , by Maagulf
నీట మునిగి ఇద్దరు వలసదారుల మృతి, మరొకరి ఆచూకీ గల్లంతు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోగా, ఒకరు గల్లంతయ్యారు. అల్ బెడా తీరంలో అల్ మసిలా కోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. మొత్తం 9 మంది వలసదారుల్ని సహాయక సిబ్బంది రక్షించగా, అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి వుంది. బలమైన కెరటాల కారణంగా పది మంది ప్రమాదంలో వున్నట్లుగా ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందింది. కోస్ట్ గార్డ్ పెట్రోల్స్ సంఘటనా స్థలానికి చేరుకుని 9 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు చనిపోయారు. ఏడుగురి పరిస్థితి బాగానే వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com