తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 10, 2021దోహా: తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.భారత్ 75 వ వసంతాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని 'అజాది కా అమ్రిత్ హోత్సవ్' లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ ను నిర్వహించారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని తెలిపిన వివరాల ప్రకారం
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతార్ భారత రాయబారి డా.దీపక్ మిత్తల్ సతీమణి అల్పన మిత్తల్,ఖతార్ లో భారత రాయబార కార్యాలయ అధికారి పద్మ కర్రి హాజరు కాగా
ఐసిసి అధ్యక్షులు పి.బాబు రాజన్, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు,
ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ రావు కోడూరి, ICBF అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, ICBF ఉపాధ్యక్షుడు వినోద్ నాయర్ విశిష్ట అతిథులు గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చేనేత కళాకారులకు అండగా సిరిసిల్ల నుండి ప్రఖ్యాత చేనేత కళాకారుడు విజయ్ కుమార్ ప్రత్యేకంగా తెప్పించిన అగ్గిపెట్టె లో ఇమిడే చీర, ఉంగరంలో పట్టే చీర ను తెలంగాణ చేనేత గొప్ప తనాన్ని ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్య్రమాల్లో భాగంగా విదేశాల్లో మొట్ట మొదటి సారి తెలంగాణ ఒగ్గు కథని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో A.R రహ్మాన్ తెలంగాణ జాగృతి కోసం ప్రత్యేకంగా స్వర పరిచిన బతుకమ్మ పాట ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
అన్ని వర్గాల నుండి 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో విదేశి గడ్డపై ఆడపడుచులు సిరిసిల్ల చీర లతో, ఆటపాటలతో హోరెత్తించారు అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ