సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి పరిమితి పెంపు

- October 12, 2021 , by Maagulf
సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి  పరిమితి పెంపు

షార్జా: సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి సంఖ్యను షార్జా ప్రభుత్వం పెంచింది. సంతాప కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 100 మందికి పెంచింది. అలాగే ఇళ్ల వద్ద 20 మంది వరకు తమ సంతాపాన్ని తెలియజేయడానికి అనుమతి ఇచ్చింది.
అయితే, సంతాపం తెలిపేందుకు హాజరయ్యే వారందరూ పూర్తి టీకాలు వేయించుకోవడంతో పాటు అల్ హాస్న్ యాప్‌లో గ్రీన్ పాస్ పొంది ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులు, ఆరోగ్య పరిస్థితి ఉన్న ఎవరైనా సంతాప కార్యక్రమాలకు దూరంగా ఉంటేే మంచిదని సూచించింది.స్థానిక షార్జా ఎమర్జెన్సీ, సంక్షోభం అండ్ విపత్తు నిర్వహణ బృందం (SECDMT) అధికారులు జారీ చేసిన ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాలని షార్జా ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com