రెస్టారెంట్లలో టేబుల్ కు 10 మంది కూర్చునేందుకు అనుమతి

- October 12, 2021 , by Maagulf
రెస్టారెంట్లలో టేబుల్ కు 10 మంది కూర్చునేందుకు అనుమతి

సౌదీ అరేబియా: సౌదీ రెస్టారెంట్లలో ఇకపై టేబుల్‌కు 10 మంది వరకు కూర్చొనేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు  సౌదీ మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు,  గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రెస్టారెంట్లు,కేఫ్‌లలో ఒక టేబుల్ దగ్గర కూర్చోవడానికి అనుమతించే వ్యక్తుల సంఖ్య 10కి పెరగనుంది.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని.. ఆరోగ్య స్థితిలో ఉన్న వారికి మాత్రమే రెస్టారెంట్లు, కేఫ్‌లలోకి అనుమతి ఇస్తున్నారు. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించబడుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్నాళ్లు రెస్టారెంట్లలో టేబుల్ కు కొంతమందికి మాత్రమే అనుమతించారు. కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో పరిమితి పెంచారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com