భారత్లో మరో ప్రైవేట్ ఎయిర్లైన్స్కు గ్రీన్ సిగ్నల్
- October 12, 2021న్యూఢిల్లీ: 'ఆకాశ ఎయిర్'కు కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. పౌర విమానయాన శాఖ 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి)' జారీ చేసినట్లు కంపెనీ ఆకాశ ఎయిర్ వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది వేసవి నాటికి విమాన యాన సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించవచ్చని బిలయనీర్ రాకేష్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. ఎన్ఒసి జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు' అని ఆకాశ ఎయిర్ సిఇఒ వినరు దూబే ట్వీట్ చేశారు. దూబే గతంలో జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఆకాశ ఎయిర్ బోర్డ్ సభ్యుల్లో ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు.వచ్చే నాలుగేళ్లలో 70 విమానాలు నడిపేందుకు ఆకాశా ఎయిర్ సంస్థ ప్లాన్ చేస్తున్నది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..