కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు
- October 13, 2021
ఖతార్: మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దులు మినహా ఖతార్లోని బహిరంగ ప్రదేశాల్లో COVID-19 కోసం థర్మల్ స్క్రీనింగ్ అవసరం లేదని ఖతార్ పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ (MoPH) స్పష్టం చేసింది. ఈ మేరకు COVID-19 థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు చేసినట్టు తన ట్విట్టర్ పేజీలో చేసిన పోస్ట్ లో ప్రకటించింది. ఇటీవల రోజువారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏదేమైనా, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి గ్రీన్ ఎహతరాజ్ స్థితి ఇప్పటికీ తప్పనిసరి అని MoPH స్పష్టం చేసింది. అక్టోబర్ 3 నుంచి కోవిడ్ -19 ఆంక్షలను సడలించే నాల్గవ దశను ఖతార్ ప్రారంభించింది.ఈ దశలో బహిరంగ బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు ఉపయోగించడం, పబ్లిక్ ప్లేస్ లో పలు సౌకర్యాలు, మరుగుదొడ్లను తెరవడం వంటి విషయాల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే నాలుగో దశ నిబంధనల్లో మార్పుల తర్వాత ఖతార్ లో 100 శాతం సామర్థ్యంతో స్కూల్స్, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







