కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు
- October 13, 2021
ఖతార్: మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దులు మినహా ఖతార్లోని బహిరంగ ప్రదేశాల్లో COVID-19 కోసం థర్మల్ స్క్రీనింగ్ అవసరం లేదని ఖతార్ పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ (MoPH) స్పష్టం చేసింది. ఈ మేరకు COVID-19 థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు చేసినట్టు తన ట్విట్టర్ పేజీలో చేసిన పోస్ట్ లో ప్రకటించింది. ఇటీవల రోజువారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏదేమైనా, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి గ్రీన్ ఎహతరాజ్ స్థితి ఇప్పటికీ తప్పనిసరి అని MoPH స్పష్టం చేసింది. అక్టోబర్ 3 నుంచి కోవిడ్ -19 ఆంక్షలను సడలించే నాల్గవ దశను ఖతార్ ప్రారంభించింది.ఈ దశలో బహిరంగ బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు ఉపయోగించడం, పబ్లిక్ ప్లేస్ లో పలు సౌకర్యాలు, మరుగుదొడ్లను తెరవడం వంటి విషయాల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే నాలుగో దశ నిబంధనల్లో మార్పుల తర్వాత ఖతార్ లో 100 శాతం సామర్థ్యంతో స్కూల్స్, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







