కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు
- October 13, 2021ఖతార్: మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దులు మినహా ఖతార్లోని బహిరంగ ప్రదేశాల్లో COVID-19 కోసం థర్మల్ స్క్రీనింగ్ అవసరం లేదని ఖతార్ పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ (MoPH) స్పష్టం చేసింది. ఈ మేరకు COVID-19 థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు చేసినట్టు తన ట్విట్టర్ పేజీలో చేసిన పోస్ట్ లో ప్రకటించింది. ఇటీవల రోజువారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏదేమైనా, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి గ్రీన్ ఎహతరాజ్ స్థితి ఇప్పటికీ తప్పనిసరి అని MoPH స్పష్టం చేసింది. అక్టోబర్ 3 నుంచి కోవిడ్ -19 ఆంక్షలను సడలించే నాల్గవ దశను ఖతార్ ప్రారంభించింది.ఈ దశలో బహిరంగ బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు ఉపయోగించడం, పబ్లిక్ ప్లేస్ లో పలు సౌకర్యాలు, మరుగుదొడ్లను తెరవడం వంటి విషయాల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే నాలుగో దశ నిబంధనల్లో మార్పుల తర్వాత ఖతార్ లో 100 శాతం సామర్థ్యంతో స్కూల్స్, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్