ఏపీ కరోనా అప్డేట్

- October 13, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కొత్తగా 517 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,88,39,595 శాంపిల్స్‌ పరీక్షించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,58,582కు చేరుకోగా.. రికవరీ కేసులు 20,37,691కు పెరిగాయి.మరోవైపు కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు 14,276 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,615 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 97, తూర్పు గోదావరిలో 88, గుంటూరులో 84 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com