షేక్ జాబర్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇండియన్
- October 14, 2021కువైట్:షేక్ జాబర్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ఇండియాకు చెందిన వ్యక్తి ప్రయత్నించాడు.ఐతే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే అలర్ట్ అయి అతన్ని కాపాడాడు. ఈజిప్ట్ కు చెందిన ఓ వ్యక్తి కూాడా ఇలాగే ఆత్మహత్యాయత్నం చేశాడు. అది జరిగిన 24 గంటల లోపే భారత్ కు చెందిన వ్యక్తి సూసైడ్ కు ప్రయత్నించాడు. ‘జాబర్ బ్రిడ్జ్ నుండి ఒక వ్యక్తి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు కాల్ వచ్చింది. ఒక పౌరుడు అతడిని రక్షించి భద్రతా అధికారులకు అప్పగించాడు.’అని అక్కడ జరిగిన సంఘటనను ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి వయసు 36 ఏళ్లు.పోలీసులు అదుపులో ఉన్నాడు. అతని మానసిక పరిస్థితి బాగానే ఉందని...చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.కువైట్ నిబంధనల ప్రకారం ఆత్మహత్య కు ప్రయత్నించిన ఇండియన్ ను దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?