షేక్ జాబర్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇండియన్
- October 14, 2021కువైట్:షేక్ జాబర్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ఇండియాకు చెందిన వ్యక్తి ప్రయత్నించాడు.ఐతే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే అలర్ట్ అయి అతన్ని కాపాడాడు. ఈజిప్ట్ కు చెందిన ఓ వ్యక్తి కూాడా ఇలాగే ఆత్మహత్యాయత్నం చేశాడు. అది జరిగిన 24 గంటల లోపే భారత్ కు చెందిన వ్యక్తి సూసైడ్ కు ప్రయత్నించాడు. ‘జాబర్ బ్రిడ్జ్ నుండి ఒక వ్యక్తి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు కాల్ వచ్చింది. ఒక పౌరుడు అతడిని రక్షించి భద్రతా అధికారులకు అప్పగించాడు.’అని అక్కడ జరిగిన సంఘటనను ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి వయసు 36 ఏళ్లు.పోలీసులు అదుపులో ఉన్నాడు. అతని మానసిక పరిస్థితి బాగానే ఉందని...చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.కువైట్ నిబంధనల ప్రకారం ఆత్మహత్య కు ప్రయత్నించిన ఇండియన్ ను దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు