తైవాన్లో భారీ అగ్నిప్రమాదం, 46 మంది మృతి
- October 14, 2021తైవాన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.కాహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల ఓ భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో తమకు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు కొందరు వెల్లడించారు.ప్రమాద కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.ప్రమాద సమయంలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.
అగ్నిప్రమాద దృశ్యాలు పొరుగునే ఉన్న మరో బిల్డింగ్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాని ప్రకారం... మొదట ఆ భవనం మొదటి అంతస్తులోనే మంటలు చెలరేగాయి.ఆ తర్వాత క్షణాల్లోనే పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3గం. సమయంలో ఫైర్ సిబ్బందికి ప్రమాదంపై సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో మొత్తం 120 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 46 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మిగతావారి పరిస్థితేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు