యాక్టివ్ కోవిడ్ 19 కేసులతో కాంటాక్ట్ ఉన్నవారికి గ్రీన్ షీల్డ్ వుంటే క్వారంటైన్ అవసరం లేదు
- October 14, 2021
మనామా: గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది క్వారంటైన్ విషయమై. కోవిడ్ 19 యాక్టివ్ కేసులతో కాంటాక్ట్ వున్నవారికి గ్రీన్ షీల్డ్ గనుక వుంటే, వారికి క్వారంటైన్ అవసరం లేదు. ఈ వెసులుబాటు 15 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. అదే గ్రీన్ షీల్డ్ లేకుండా కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు కాంటాక్ట్ వుంటే మాత్రం తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ పాటించాలి. గతంలో ఇది 10 రోజులుగా వుండేది. క్వారంటైన్ మొదటి రోజున అలాగే ఏడవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ పొందిన లేదా కరోనా నుంచి కోలుకున్నవారికి కోవిడ్ 19 కాంటాక్టు వున్నా వారికి క్వారంటైన్ అవసరం వుండదు. అయితే వారు తొలి రోజులు అలాగే ఏడవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ సంబంధిత సమస్యలేమైనా వుంటే అదనంగా మరో టెస్ట్ అవసరమవుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







