యాక్టివ్ కోవిడ్ 19 కేసులతో కాంటాక్ట్ ఉన్నవారికి గ్రీన్ షీల్డ్ వుంటే క్వారంటైన్ అవసరం లేదు
- October 14, 2021
మనామా: గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది క్వారంటైన్ విషయమై. కోవిడ్ 19 యాక్టివ్ కేసులతో కాంటాక్ట్ వున్నవారికి గ్రీన్ షీల్డ్ గనుక వుంటే, వారికి క్వారంటైన్ అవసరం లేదు. ఈ వెసులుబాటు 15 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. అదే గ్రీన్ షీల్డ్ లేకుండా కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు కాంటాక్ట్ వుంటే మాత్రం తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ పాటించాలి. గతంలో ఇది 10 రోజులుగా వుండేది. క్వారంటైన్ మొదటి రోజున అలాగే ఏడవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ పొందిన లేదా కరోనా నుంచి కోలుకున్నవారికి కోవిడ్ 19 కాంటాక్టు వున్నా వారికి క్వారంటైన్ అవసరం వుండదు. అయితే వారు తొలి రోజులు అలాగే ఏడవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ సంబంధిత సమస్యలేమైనా వుంటే అదనంగా మరో టెస్ట్ అవసరమవుతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









