పార్లమెంట్ ను రద్దు చేసిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
- October 14, 2021
జపాన్: జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన “ఫుమియో కిషిడా”..ఆ దేశ పార్లమెంట్ లోని దిగువ సభను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో దిగువ సభ రద్దు అయినట్లు దిగువ సభ స్పీకర్ తడమొరి ఓషిమా ధృవీకరించారు. స్పీకర్ ప్రకటన చేసిన సమయంలో సభకు హజరైన దిగువ సభ లోని 465 మంది సభ్యులు లేచి నిలబడి బల్లలు చరిచి తమ అంగీకారం తెలిపారు. జపాన్ ప్రధాని తాజా నిర్ణయం పై ప్రపంచ దేశాలు నివ్వెర పోయాయి. అయితే జపాన్ ప్రధాని మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. తన పాలనకు ప్రజల ఆమోదం పొందేందుకే ఎన్నికలకు వెళ్లున్నట్లు ప్రకటించారు. కిషిడా తాజా నిర్ణయంతో అక్టోబరు 31న జపాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









