పార్లమెంట్ ను రద్దు చేసిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
- October 14, 2021జపాన్: జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన “ఫుమియో కిషిడా”..ఆ దేశ పార్లమెంట్ లోని దిగువ సభను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో దిగువ సభ రద్దు అయినట్లు దిగువ సభ స్పీకర్ తడమొరి ఓషిమా ధృవీకరించారు. స్పీకర్ ప్రకటన చేసిన సమయంలో సభకు హజరైన దిగువ సభ లోని 465 మంది సభ్యులు లేచి నిలబడి బల్లలు చరిచి తమ అంగీకారం తెలిపారు. జపాన్ ప్రధాని తాజా నిర్ణయం పై ప్రపంచ దేశాలు నివ్వెర పోయాయి. అయితే జపాన్ ప్రధాని మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. తన పాలనకు ప్రజల ఆమోదం పొందేందుకే ఎన్నికలకు వెళ్లున్నట్లు ప్రకటించారు. కిషిడా తాజా నిర్ణయంతో అక్టోబరు 31న జపాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..