కళాభవన్ మణిది అసహజ మరణం...
- March 18, 2016
మలయాళ నటుడు కళాభవన్ మణి మృతిపై ఫోర్సెనిక్ పరీక్షల అనంతరం ఆయన శరీరంలో విషపూరితమైన పురుగు మందు, ఇథనాల్, మిథనాల్ అవశేషాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నటుడు, గాయకుడు అయిన మణి(45) మార్చి 6న చనిపోయిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా మణిని మార్చి 4న ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మార్చి 6న చనిపోయారు. వైద్యులు ఆయన శరీరంలో రసాయనాలు ఉన్నట్లు చెప్పడంతో మణి మరణంపై అనుమానాలు రేకెత్తాయి. కొచ్చిలోని కాక్కనాడ్లో మణి శరీరంలో విషపూరిత పదార్థాలపై లాబరేటరీ పరీక్షలు చేశారు.పరీక్షలో ప్రమాదకరమైన క్లోర్పైరిఫోస్ ఉన్నట్లు కెమికల్ ఎగ్జామినర్ కె.మురళిధరన్ తెలిపారు. మణి మరణంపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలపడంతో అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణిది ఆత్మహత్య కాదని, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని మణి భార్య తెలిపారు. మణి రెండొందలకు పైగా మళయాళ, తమిళ సినిమాల్లో నటించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







