కళాభవన్ మణిది అసహజ మరణం...
- March 18, 2016
మలయాళ నటుడు కళాభవన్ మణి మృతిపై ఫోర్సెనిక్ పరీక్షల అనంతరం ఆయన శరీరంలో విషపూరితమైన పురుగు మందు, ఇథనాల్, మిథనాల్ అవశేషాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నటుడు, గాయకుడు అయిన మణి(45) మార్చి 6న చనిపోయిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా మణిని మార్చి 4న ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మార్చి 6న చనిపోయారు. వైద్యులు ఆయన శరీరంలో రసాయనాలు ఉన్నట్లు చెప్పడంతో మణి మరణంపై అనుమానాలు రేకెత్తాయి. కొచ్చిలోని కాక్కనాడ్లో మణి శరీరంలో విషపూరిత పదార్థాలపై లాబరేటరీ పరీక్షలు చేశారు.పరీక్షలో ప్రమాదకరమైన క్లోర్పైరిఫోస్ ఉన్నట్లు కెమికల్ ఎగ్జామినర్ కె.మురళిధరన్ తెలిపారు. మణి మరణంపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలపడంతో అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణిది ఆత్మహత్య కాదని, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని మణి భార్య తెలిపారు. మణి రెండొందలకు పైగా మళయాళ, తమిళ సినిమాల్లో నటించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







