తాప్సీ పన్ను కొత్త హీరోయినేం కాదు : అమితాబ్
- March 18, 2016
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ హీరోయిన్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ప్రస్తుతం ఆయన జాతీయ అవార్డు సాధించిన బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న 'పింక్' మూవీలో నటిస్తున్నారు. దుబాయ్ లో శుక్రవారం జరిగిన ఓ సినిమా అవార్డుల కార్యక్రమానికి హాజరైన అమితాబ్.. మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ లాంటి కొత్త వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ప్రశ్నలు అడిగారు.దానికి ఆయన స్పందిస్తూ, ''తాప్సీ పన్ను కొత్త హీరోయినేం కాదు.. ఆమె ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. అంతకుమించి మంచి ప్రొఫెషనల్'' అంటూ ఈ భామకు బిగ్ బీ మంచి మార్కులే వేశారు.అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న 'పింక్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయట. సెప్టెంబర్ 16న 'పింక్' చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సూజిత్ సర్కార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూజిత్ ప్రొడక్షన్ లో తనకు ఇది మూడో చిత్రమని, గతంలో 'షోబైట్', 'పీకూ' మూవీలలో నటించానని చెప్పుకొచ్చారు.''అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండి తెరపై నా పేరు రాబోతుందనే విషయం తల్చుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఆందోళనగా, ఆనందంగా.. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి'' అని తాప్సీ అన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







