24 నుంచి పూర్తి సామర్థ్యంతో నడవనున్న 'కువైట్ ఎయిర్ పోర్ట్'
- October 21, 2021కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను అక్టోబర్ 24 నుంచి పూర్తి సామర్థ్యంతో పని చేయనుంది. ఇందుకు సంబంధించి మూడో దశ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ని మినిస్టర్స్ కౌన్సిల్ ఆదేశించిందని DGCA ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రోజుకు 10,000 మంది ప్రయాణికుల పరిమితిని మాత్రమే కలిగి ఉంది. దీని కారణంగా ఇండియాతో సహా వివిధ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులు అధిక ధర పెట్టి టిక్కెట్ కొనాల్సి వస్తుంది. ఈ ఆదివారం నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో తెరవడం వల్ల విమాన టిక్కెట్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక