బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- October 21, 2021రియాద్: సౌదీ ఆరోగ్య శాఖ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు హై రిస్క్ లో ఉన్న వారికే బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఐతే రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలల వ్యవధి ఉన్న వారు మాత్రమే బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. "Tawakkalna", "sehhati" యాప్ ల ద్వారా అపాయింట్ మెంట్ ను బుక్ చేసుకోవచ్చు. హై రిస్క్ కేటగిరీలో ఉన్న వారు మాత్రం తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కు రిస్క్ ఎక్కువగా ఉంది. దీంతో ముందుగా వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ ప్రభుత్వానికి సూచించారు. ఆ మేరకు సౌదీ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..