ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య మంత్రుల సమావేశం
- October 21, 2021మనామా: బహ్రెయిన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ జాయెద్ రషీద్ అల్ జయానీతో ఒమన్ వాణిజ్య, పరిశ్రమ ల మంత్రి కైస్ మహ్మద్ అల్ యూసఫ్ సమావేశమయ్యారు. మనామాలో జరుగుతున్న జీసీసీ వాణిజ్య, పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈ రెండు దేశాల మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహ్రెయిన్ లో ని ఒమన్ రాయబారి మహ్మద్ అలీ అల్ బలుషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వ్యాపార సంబంధాలు, ప్రోత్సహకాలపై సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించారు. రెండు దేశాల పెట్టుబడులకు సంబంధించి ఆసక్తి గా ఉన్న వ్యాపారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్