షారూఖ్ ఖాన్కు బిగ్ షాక్..ఎన్సీబీ అధికారుల సోదా
- October 21, 2021డ్రగ్స్ కేసు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చుబిగుకుంటోంది. మూడు సార్లు అతడి బెయిల్ పిటిషన్ ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఐతే తాజాగా ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నివాసంలోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్డు జైలులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా మన్నాట్కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నివాసానికి కూడా మరో ఎన్సీబీ టీమ్ వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్సీబీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేశారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?