ట్యాక్సులు తగ్గించండి.. మోదీని కోరిన టెస్లా
- October 21, 2021
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ నెంబర్ వన్. అయితే ఆ కంపెనీ ఇండియాలో తన వాహనాలను అమ్మాలనుకుంటున్నది. మన దేశంలో ఇంపోర్టెడ్ కార్లు అమ్మాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాల్సిందే. అయితే ఆ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నట్లు టెస్లా కంపెనీ ఆరోపిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతూ..ప్రధానమంత్రి కార్యాలయానికి టెస్లా కంపెనీ ప్రతినిధులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంపోర్ట్ ట్యాక్సులు ఇండియాలో ఎక్కువగా ఉన్నట్లు టెస్లా ప్రతినిధులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సుంకాన్ని తగ్గిస్తే, అప్పుడు దేశీయ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు తగ్గుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఇండియా ఎగ్జిక్యూటివ్ మనుజ్ ఖురానా..
ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గింపు అంశంపై.. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉన్న పన్ను విధానం తమ కంపెనీకి అనుకూలంగా లేదని టెస్లా అధికారులు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 60 శాతం దిగుమతి సుంకాన్ని ఇండియా వసూల్ చేస్తున్నది. పన్నులు ఎక్కువ స్థాయిలో కట్టడం వల్ల.. వాహనాల ఖరీదు మరింత ప్రియం అవుతుందని టెస్లా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







