షారూఖ్ ఖాన్కు బిగ్ షాక్..ఎన్సీబీ అధికారుల సోదా
- October 21, 2021డ్రగ్స్ కేసు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చుబిగుకుంటోంది. మూడు సార్లు అతడి బెయిల్ పిటిషన్ ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఐతే తాజాగా ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నివాసంలోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్డు జైలులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా మన్నాట్కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నివాసానికి కూడా మరో ఎన్సీబీ టీమ్ వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్సీబీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేశారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!