షారూఖ్ ఖాన్కు బిగ్ షాక్..ఎన్సీబీ అధికారుల సోదా
- October 21, 2021
డ్రగ్స్ కేసు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చుబిగుకుంటోంది. మూడు సార్లు అతడి బెయిల్ పిటిషన్ ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఐతే తాజాగా ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నివాసంలోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్డు జైలులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా మన్నాట్కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నివాసానికి కూడా మరో ఎన్సీబీ టీమ్ వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్సీబీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేశారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







