న్యాయస్థానాల్లోకి వచ్చేందుకు లాయర్లకు అనుమతి....
- October 22, 2021సౌదీ అరేబియా: సౌదీలో అన్ని కోర్టులలో కోవిడ్ రూల్స్ ను సులభతరం చేశారు. కోర్టులలో లాయర్లను అనుమతించనున్నారు. ఇన్నాళ్లు కరోనా ఎఫెక్ట్ కారణంగా వర్చువల్ గానే కేసులను విచారిస్తున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో లాయర్లను కోర్టులలోకి అనుమతించాలని సౌదీ న్యాయశాఖ నిర్ణయించింది. దేశంలోని అన్ని కోర్టులలోకి లాయర్లకు పర్మిషన్ ఇచ్చింది. క్లయింట్స్ ను మాత్రం రిసెప్షన్ వరకే అనుమతించనున్నారు. అక్కడ నుంచే వారు క్లయింట్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది. న్యాయశాఖకు సంబంధించిన అధికారుల విజ్ఞప్తి మేరకు హెల్త్ డిపార్ట్ మెంట్ రూల్స్ ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ న్యాయశాఖ తెలిపింది. అదే విధంగా ఈ లిటిగేషన్ ప్రొసీజర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఈ ప్రొసీజర్ ను కూడా అనుమతిస్తామంది. ఐతే కోర్టులో కి ఎంట్రీ ఇచ్చే వారందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. నెల రోజుల తర్వాత పరిస్థితిని బట్టి మరిన్ని సడలిపంపులు ఇస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్