ఐడీఎఫ్, ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో హెల్త్ సెమినార్
- October 23, 2021
కువైట్: ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్, (IDF) ఇండియన్ ఎంబసీ సంయుక్తంగా హెల్త్ సెమినార్ కండక్ట్ చేశాయి. ఈ సెమినార్ లో ప్రముఖ డాక్టర్స్ తమ విలువైన అనుభవాలను పంచుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. డాక్టర్ మధు గుప్తా ఆధ్వర్యంలో సెంటిఫిక్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ రిఫత్ జెహన్, డాక్టర్ తన్ సీమ్ జాస్వీ, డాక్టర్ సుసోవానా నాయర్, డాక్టర్ తన్ సీమ్ అమీర్ తమ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. వైద్య రంగంలో భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించారు. ఈ సెమినార్ లో దాదాపు 100 మందికి పైగా మహిళకు ఫ్రీ గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు. భారత రాయబారితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హెల్త్ విషయం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐడీఎఫ్ ఎంతగానో కృషి చేస్తుందని ఐడీఎఫ్ ప్రెసిడెంట్ అమీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా







