ఐడీఎఫ్, ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో హెల్త్ సెమినార్
- October 23, 2021
కువైట్: ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్, (IDF) ఇండియన్ ఎంబసీ సంయుక్తంగా హెల్త్ సెమినార్ కండక్ట్ చేశాయి. ఈ సెమినార్ లో ప్రముఖ డాక్టర్స్ తమ విలువైన అనుభవాలను పంచుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. డాక్టర్ మధు గుప్తా ఆధ్వర్యంలో సెంటిఫిక్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ రిఫత్ జెహన్, డాక్టర్ తన్ సీమ్ జాస్వీ, డాక్టర్ సుసోవానా నాయర్, డాక్టర్ తన్ సీమ్ అమీర్ తమ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. వైద్య రంగంలో భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించారు. ఈ సెమినార్ లో దాదాపు 100 మందికి పైగా మహిళకు ఫ్రీ గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు. భారత రాయబారితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హెల్త్ విషయం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐడీఎఫ్ ఎంతగానో కృషి చేస్తుందని ఐడీఎఫ్ ప్రెసిడెంట్ అమీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









